Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రక్తదాన శిబిరానికి స్పందన

రక్తదాన శిబిరానికి స్పందన

0

రక్తదాన శిబిరానికి స్పందన

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా): పట్టణంలోని వరలక్ష్మి థియేటర్ దగ్గర నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన రావడం జరిగిందని రక్త బంధం ఆర్గనైజేషన్ నాయకులు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్త బంధం ట్రస్టు, రజిని హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్, మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హాజరు కావడం జరిగిందని, ఇటువంటి పుట్టినరోజు వేడుకలు తాము నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరం, మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలు కూడా తమ నిర్వహించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అనంతరం చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రక్త బంధం ట్రస్టు, రజిని హెల్పింగ్ ట్రస్టు ,పవన్ కళ్యాణ్, మెగా ఫ్యాన్స్ వారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం పట్ల వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో అఖిల్ రాయల్ కోటికి రామాంజి చింతా రాజేష్ భవాని శంకర్ శివప్రసాద్ బోనాల వినయ్ లతోపాటు రక్త బంధం ట్రస్ట్, రజిని హెల్పింగ్ హాండ్స్, మెగా ఫాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story: రక్తదాన శిబిరానికి స్పందన)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version