Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మహనీయులు త్యాగ ఫలితమే నేటి స్వాతంత్రం

మహనీయులు త్యాగ ఫలితమే నేటి స్వాతంత్రం

మహనీయులు త్యాగ ఫలితమే నేటి స్వాతంత్రం

టిడిపి సీనియర్ నాయకురాలు మందలపుజయప్రద ( జయమ్మ)

న్యూస్ తెలుగు /చాట్రాయి : ఎందరో మహనీయులు వీర వనితల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్రం అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు ,వయోవృద్ధురాలు, పోతనపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మందలపు జయప్రద (జయమ్మగారు) గుర్తు చేశారు. గురువారం 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జయప్రద చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. బ్రిటిష్ తెల్లదొరలను తరిమి కొట్టడానికి దేశంలో ఎందరో మహనీయులు ఎంతో విలువైన తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారని ఝాన్సీ లక్ష్మీబాయి తాంతియాతోపే వంటి వీరవనితలు కూడా విరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు అబ్బుల్ చౌదరి, లావూరి వెంకటేశ్వరరావు, హనుమంతు, జనసేన పాపారావు ,తదితరులు పాల్గొన్నారు. (Story : మహనీయులు త్యాగ ఫలితమే నేటి స్వాతంత్రం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!