Homeవార్తలుతెలంగాణఉమ్మడి ఖమ్మం జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకి అత్యధిక ప్రాధాన్యతనిస్తాం

ఉమ్మడి ఖమ్మం జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకి అత్యధిక ప్రాధాన్యతనిస్తాం

ఉమ్మడి ఖమ్మం జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకి అత్యధిక ప్రాధాన్యతనిస్తాం

సిఎం రేవంత్ రెడ్డి

న్యూస్‌తెలుగు/ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా పెండింగ్ ప్రాజెక్టు ల పూర్తికి అత్యధిక ప్రాధాన్యతనిస్తామని రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్టుని మంత్రుల సమక్షంలో ఆయన ప్రారంభించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో మంత్రులు డ్డిఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రె పాల్గొన్నారు. తొలి పంప్‌హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. ములకలపల్లి మండలం కమలాపురంలో మూడో పంప్‌ హౌస్‌ను మంత్రి భట్టి విక్రమార్క స్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించారు. పదేళ్లు అధికారంలో ఉండి అప్పటి ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు డీపీఆరే ఇవ్వలేదని.. కమీషన్ల బాగోతం బయటపడుతుందనే అలా చేయలేదని రేవంత్ ఆరోపించారు. స్వాతంత్ర దినోత్సవం నాడే ఖమ్మం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సీతారామ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సీఎం అన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు నిధుల కోసం ఒత్తిడి చేస్తే నేను మిగతా జిల్లాల గురించి కూడా ఆలోచిస్తున్నా. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా నిధుల కేటాయింపులో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం. కేసీఆర్ పది సంవత్సరాలు అధికారంలో ఉండి రూ.లక్షా 80 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వలేదు. కేసీఆర్, హరీష్ బోగస్ మాటలు చెబుతారు గనుక ఆ పార్టీ నేతలు నీళ్ళ కోసం ఆందోళన చేయలేదు. నాగార్జున సాగర్ నీళ్ళు రాకపోయినా గోదావరి జలాలతో సాగర్ ఆయకట్టు కోసం వైరా లింక్ కెనాల్ చేపట్టాం. లింక్ కెనాల్ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ వెంటపడి చేపించాం.

పదేళ్లు అధికారంలో ఉండి అప్పటి ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు డీపీఆరే ఇవ్వలేదు. కమీషన్ల బాగోతం బయటపడుతుందనే అలా చేయలేదు. మంత్రి తుమ్మలపై నమ్మకంతో నష్ట పరిహారం ఇవ్వక పోయినా లింక్ కెనాల్‌కు రైతులు భూములు ఇచ్చారు. రీ డిజైన్ పేరుతో ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు. కమీషన్ల కోసం పంప్ మోటార్లు పెట్టారు. నాలుగేళ్లుగా పంప్ హౌస్ కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. ఆరు నెలలు రేయింబవళ్లు కష్టపడి పంప్ హౌస్‌లో నీరు పారేలా చేశాం. కృష్ణా జలాలు రాక పోయినా ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్ళు అందే అవకాశం ఉంది. పొరుగున ఉన్న నల్గొండ జిల్లాతో నీటి పంచాయితీ లేకుండా గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లాలో ఆయకట్టుకు నీరు అందిస్తాం. హరీశ్ అభినందించక పోయినా ఫర్వాలేదు కానీ అవమానించేలా మాట్లాడొద్దు. రానున్న రోజుల్లో 80, 60,40,20 శాతం పూర్తయిన ప్రాజెక్టులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం” అని రేవంత్ రెడ్డి తెలిపారు. (Story : ఉమ్మడి ఖమ్మం జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకి అత్యధిక ప్రాధాన్యతనిస్తాం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics