14 ఏళ్ల చిన్నారిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యబృందం
న్యూస్తెలుగు/హైదరాబాద్: హైదరాబాద్లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్లోని పిడియాట్రిక్ బృందం, ప్రాణాంతక సమస్యలతో కూడిన అరుదైన పరిస్థితి అయిన మస్తీనియా గ్రావిస్తో బాధపడుతున్న 14 ఏళ్ల బాలికకు విజయవంతంగా చికిత్స చేసింది. ఆక్సిజన్ స్థాయిలు అతి తక్కువగా ఉండటంతో రోగిని అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. గత రెండు సంవత్సరాలుగా, ఆమె ఆహారం తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటుంది, ఆమె కేవలం ద్రవపదార్థాలు మాత్రమే తీసుకుంటుంది, ఎవరి సహాయం లేకుండా నడవలేకపోయేది. సీనియర్ పిడియాట్రిషియన్, నియోనాటాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆమెకు పరీక్షలు చేసిన తర్వాత, గొంతు కండరాల పక్షవాతం, నాలుక, ముఖ కండరాలు, చేతులు, కాళ్ల బలహీనత ఉన్నట్లు నిర్ధారించారు. రోగికి కొన్ని రోజుల పాటు వెంటిలేషన్ అవసరం కావటంతో పాటుగా ఆస్పిరేషన్ న్యుమోనియా కోసం చికిత్స చేయబడిరది. ఆమెకు మస్తీనియా గ్రేవిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. డాక్టర్ కిరణ్ కుమార్ ఈ కేసును గురించి వెల్లడిస్తూ, పరిస్థితి తీవ్రత, సంక్లిష్టత కారణంగా ఈ కేసు ప్రత్యేకించి మాకు సవాలుగా నిలిచిందని, సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందించడానికి మా బృందం శ్రద్ధగా పనిచేసిందన్నారు. (Story : 14 ఏళ్ల చిన్నారిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యబృందం)