Homeవార్తలుజాతీయంవాయనాడ్‌ బాధితుల క్లెయిమ్స్‌ సరళతరం

వాయనాడ్‌ బాధితుల క్లెయిమ్స్‌ సరళతరం

వాయనాడ్‌ బాధితుల క్లెయిమ్స్‌ సరళతరం

న్యూస్‌తెలుగు/ముంబయి: కేరళలోని వాయనాడ్‌ కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు, బాధితులకు ప్రముఖ బీమా కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ సానుభూతి ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ పాలసీల క్లెయిమ్‌ను ఈ సందర్భంగా సరళతరం చేసినట్లు ప్రకటించింది. క్లెయిమ్‌ను పొందడటంలో ఎలాంటి సంక్లిష్టత ఎదుర్కొనకుండా, స్వల్ప ఆధారాలు చూపిస్తే సరిపోతుందని, నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. స్థానిక ప్రభుత్వ అధికారులు, పోలీసులు, హాస్పిటల్స్‌ జారీ చేసిన డెత్‌సర్టిఫికెట్‌, నామినీ గుర్తింపు ఆధారం, బ్యాంకు వివరాలు తెలియజేస్తే సరిపోతుందని, క్లెయిమ్‌ పరిపూర్తి అవుతుందని తెలిపింది. (Story : వాయనాడ్‌ బాధితుల క్లెయిమ్స్‌ సరళతరం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!