Home వార్తలు ఎన్‌జే వెల్త్‌ విజయ కథనాలు

ఎన్‌జే వెల్త్‌ విజయ కథనాలు

0

ఎన్‌జే వెల్త్‌ విజయ కథనాలు

న్యూస్‌తెలుగు/ముంబయి: ఎన్‌జే వెల్త్‌లో పాటిల్‌ వంటి వారి కార్యకలాపాల విజయగాథలు గొప్పవి. దాదాపు రూ.345 కోట్ల విలువైన ఆకట్టుకునే ఏయూఎం (నిర్వహణలో ఉన్న ఆస్తులు), రూ.3.80 కోట్లకు పైగా నెలవారీ మ్యూచువల్‌ ఫండ్‌ సిప్‌ బుక్‌తో పాటిల్‌ కు 4,000 మందికి పైగా ఇన్వెస్టర్ల భారీ కస్టమర్‌ బేస్‌ను నిర్వహించడంలో ఈ దినచర్య కీలక పాత్ర పోషించింది. ఏరోనాటికల్‌ ఇంజనీర్‌, ఎంబీఏ (ఫైనాన్స్‌) గ్రాడ్యుయేట్‌ అయిన ఆయన 2008లో సొంతంగా మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఫైనాన్షియల్‌ అనలిస్ట్గా తన సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదులుకున్నారు. గుజరాత్‌లోని కొల్హాపూర్‌లో వినోద్‌ దాదాపు 1,000 మంది ఇన్వెస్టర్ల నుంచి రూ.113 కోట్ల ఏయూఎంతో మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే వినోద్‌ తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు సాధించిన విజయం ఒకప్పుడు అసాధ్యమైన కల. భారతదేశంలో అతిపెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్లలో ఒకటైన ఎన్‌జే వెల్త్‌తో పాటిల్‌ మరియు వినోద్‌ల అనుబంధం గొప్పది. ఎన్‌జే వెల్త్‌కు దేశవ్యాప్తంగా దాదాపు 175 ప్రాంతాల్లో 32,000 యాక్టివ్‌ ఎన్జే వెల్త్‌ పార్టనర్స్‌ లేదా మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. 2003లో ఏర్పాటైన ఎన్జే వెల్త్‌ నేడు సుమారు రూ.1.39 లక్షల కోట్ల ఏయూఎంను నిర్వహిస్తూ 26.4 లక్షల మంది ఇన్వెస్టర్లకు సేవలు అందిస్తోంది. (Story : ఎన్‌జే వెల్త్‌ విజయ కథనాలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version