గురు పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
న్యూస్తెలుగు/వనపర్తి :గురు పౌర్ణమి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పెబ్బేరు మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. అనంతరం పెబ్బేరు మండల కేంద్రంలోని నిర్మలాచల రాజయోగ ఆశ్రమం సందర్శించి అక్కడి కాశీ విశ్వేశ్వర బాలబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురు పౌర్ణమి సందర్భంగా ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆశ్రమంలోని పలు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అందుకు స్పందించిన ఆయన రూ 5 లక్షల కు సంబంధించిన పనులను చేపట్టాలని మండల నాయకులకు సూచించారు . కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ సత్యనారాయణ, నాయకులు రంజిత్ కుమార్, సురేందర్ గౌడ్, రాములు యాదవ్, చీర్ల శేఖర్, మణిగిల్ల తిరుపతిరెడ్డి షకీల్, కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : గురు పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు)