Homeవార్తలుస్పోర్ట్‌కింగ్‌ ఇండియాతో ఏటీజీసీ బయోటెక్‌ భాగస్వామ్యం

స్పోర్ట్‌కింగ్‌ ఇండియాతో ఏటీజీసీ బయోటెక్‌ భాగస్వామ్యం

స్పోర్ట్‌కింగ్‌ ఇండియాతో ఏటీజీసీ బయోటెక్‌ భాగస్వామ్యం

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: ప్రపంచ పత్తి ఉత్పత్తిలో 23 శాతం వాటా కలిగిన వాణిజ్య పంటలలో పత్తి ఒకటి. ఏదేమైనా, ఇటీవలి పింక్‌ బోల్వార్మ్‌ (పిబిడబ్ల్యు) దాడి గణనీయమైన ముప్పుగా మారింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పత్తి పంటకు విస్తృతమైన వినాశనాన్ని కలిగించింది. పంట నష్టానికి తోడు రైతులు పత్తి నుంచి ఇతర పంటల వైపు మళ్లడంతో నీటి వనరులు మరింత దెబ్బతింటున్నాయి. ఈ ధోరణిని ఎదుర్కోవటానికి, భారతదేశంలోని ప్రముఖ టెక్స్‌ టైల్‌ కంపెనీ స్పోర్ట్‌కింగ్‌ ఇండియా ఎటిజిసి బయోటెక్‌, రివైవింగ్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ సెల్‌, టీమ్‌ ఎథీనా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి పంజాబ్‌ మరియు హర్యానాలో ‘శాన్‌-వర్ధన్‌’ (కాటన్‌ యు కాన్‌ ట్రస్ట్‌) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ చొరవ కింద ఎటిజిసి బయోటెక్‌ క్రెమిట్‌ (నియంత్రిత విడుదల ఎన్హాన్స్డ్‌ మేటింగ్‌ ఇంట్రప్షన్‌ టెక్నాలజీ) అనే సాంకేతికతను ప్రారంభించింది. ఇది సాంప్రదాయ క్రిమిసంహారక మందులకు స్థిరమైన ప్రత్యామ్నాయంగా ‘ఇన్సెక్ట్‌ ఫ్యామిలీ ప్లానింగ్‌’ ను అమలు చేయడం ద్వారా పర్యావరణ అనుకూల జనాభా నియంత్రణకు వీలు కల్పిస్తుంది. తద్వారా పంట మరియు నేలపై పురుగుమందుల వాడకాన్ని తగ్గిస్తుంది. (story : స్పోర్ట్‌కింగ్‌ ఇండియాతో ఏటీజీసీ బయోటెక్‌ భాగస్వామ్యం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!