Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌చక్రం తిప్పుతారా? చక్కర్లు కొడతారా?

చక్రం తిప్పుతారా? చక్కర్లు కొడతారా?

చక్రం తిప్పుతారా? చక్కర్లు కొడతారా?

చంద్రబాబుపై షర్మిల విసుర్లు

న్యూస్‌తెలుగు/అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఎక్స్‌ వేదికగా విమర్శలు కురిపించారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవారు దిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడంతోనే గడిపేస్తున్నారని పరోక్షంగా విమర్శించారు. కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు పెద్దన్న పాత్ర పోషించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. అయితే దిల్లీలో చక్రం తిప్పాల్సిన చంద్రబాబు… దిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నారని వ్యాఖ్యానించారు. ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి, బీజేపీ పెద్దలకు జీ హుజూర్‌ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నట్లు అని నిలదీశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కార్‌ ఏర్పడి నెల రోజులు దాటినప్పటికీ… మోదీతోగానీ, ఇతర మంత్రులతోగానీ ఒక్క హామీపై ఎందుకు ప్రకటన చేయించలేక పోయారన్నారు. గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు దిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా… విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణ ఉండదని కేంద్ర పెద్దలతో చెప్పించగలిగారా… పోలవరం ప్రాజెక్ట్‌ నిధులపై స్పష్టత ఇచ్చారా… రాజధాని నిర్మాణంపై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పగలిగారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న… దాటక బోడి మల్లన్న… ఇదే బీజేపీ సిద్ధాంతం అని విమర్శించారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవడం మంచిదని, మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు అడుకుంటుందని గుర్తెరగాలని సూచించారు. (Story : చక్రం తిప్పుతారా? చక్కర్లు కొడతారా?)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!