Home వార్తలు రూ.1000 కోట్లు ఫండింగ్‌ను ప్రకటించిన పర్పుల్‌ గ్రూప్‌

రూ.1000 కోట్లు ఫండింగ్‌ను ప్రకటించిన పర్పుల్‌ గ్రూప్‌

0

రూ.1000 కోట్లు ఫండింగ్‌ను ప్రకటించిన పర్పుల్‌ గ్రూప్‌

న్యూస్‌తెలుగు/ముంబయి: భారతదేశంలోని ప్రముఖ ఓమ్నిచానెల్‌ బ్యూటీ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన పర్పుల్‌ గ్రూప్‌, ఇతర పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో పాటు అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ద్వారా ?1000 కోట్ల వరకు నిధులను సేకరిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ప్రాథమిక, ద్వితీయ షేర్ల కలయికను కలిగి ఉంటుంది. వ్యూహాత్మకంగా తన ఆఫ్‌లైన్‌ ఉనికిని విస్తరిస్తూ, పర్పుల్‌ గ్రూప్‌ తన ఆరు డైరెక్ట్‌-టు-కన్స్యూమర్‌ ప్రైవేట్‌ బ్రాండ్‌లను రిటైల్‌ చేస్తుంది. వీటిలో ఫేసెస్‌ కెనడా, ఆల్ప్స్‌ గుడ్‌నెస్‌, గుడ్‌ వైబ్స్‌, కార్మేసి, డెర్మ్‌ డాక్‌, నై బే మల్టీ టచ్‌పాయింట్‌లలో ఉన్నాయి. బ్రాండ్‌ భారతదేశంలో 1500కు పైగా సహాయక మరియు 40000ం టచ్‌పాయింట్‌లను కలిగి ఉంది. మెట్రో నగరాలకు మించి విస్తరిస్తున్న టైర్‌ 2/3ం మైక్రో మార్కెట్లలో వినియోగదారుల సౌందర్య అవసరాలను కంపెనీ అందిస్తోందని పర్పుల్‌లో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మనీష్‌ తనేజా చెప్పారు. (Story : రూ.1000 కోట్లు ఫండింగ్‌ను ప్రకటించిన పర్పుల్‌ గ్రూప్‌)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version