UA-35385725-1 UA-35385725-1

మొదటి నెల జీతం అమ‌రావ‌తికే

మొదటి నెల జీతం అమ‌రావ‌తికే

న్యూస్ తెలుగు/విజయనగరం: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తనకు లభించే తొలి నెల జీతాన్ని (పలు అలవెన్సులు అన్నింటితో కూడిన జీతాన్ని అంతటిని) రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబునాయుడు కి అందజేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు కుటుంబ సమేతంగా సందర్శించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. పోలవరం, అమరావతి రెండు ప్రాజెక్టులు అభివృద్ధి జరగాలని, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆశీస్సులు అందజేయాలని ఈ సందర్భంగా అప్పలనాయుడు వేడుకున్నారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం ప్రజానీకం స్వామివారి ఆశీస్సులతో తనను పార్లమెంటుకు పంపించినందుకు అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో 5 ఏళ్లు కాలం పరిపాలన కొనసాగించేందుకు కూడా స్వామివారి ఆశీస్సులు కావాలని వేడుకున్నారు. ఒక ఆంధ్రుడిగా బాధ్యతతో రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం తనవంతుగా మొదటి జీతాన్ని అందజేసేందుకు నిర్ణయించుకున్న అందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు. (Story: మొదటి నెల జీతం అమ‌రావ‌తికే)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1