హుకుంపేట అమ్మవారి ఊరేగింపులో సిరమ్మ
న్యూస్ తెలుగు/విజయనగరం: విజయనగరం హుకుంపేటలో శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మ వారు చదురు వద్ద ఘటాలు ఊరేగింపులో విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్, వై.యస్.ఆర్.సి.పీ. జిల్లా అధ్యక్షులు, ఉత్తరాంధ్ర వై.యస్.ఆర్.సి.పీ. డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస రావు(చిన్న శ్రీను)గారి కుమార్తె సిరి సహస్ర (సిరమ్మ) పాల్గొని పసుపు కుంకుమలు, పట్టువస్త్రములు సమర్పించారు. చదురు వద్ద ఉంచిన ఘటాలుకు ప్రత్యేక పూజలు చేసి, ఘటాలు ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇల వేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి చల్లని చూపు ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్ధించినట్లు చెప్పారు . రైతులు సంతోషంగా ఉంటేనే రాజ్యం బాగుంటుదని, ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని దానితో రైతాంగం బాగుండాలి అని అమ్మవారిని కోరినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నశ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, సోల్జర్స్ సభ్యులు, జగదీష్ , శివ, హేమంత్, మజ్జి ప్రసాద్, యడ్ల ప్రసాద్, చంటి, మంత్రి తదితరులు పాల్గొన్నారు. (Story: హుకుంపేట అమ్మవారి ఊరేగింపులో సిరమ్మ)