Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌బ్రాహ్మణపల్లి రెవెన్యూ గ్రామ సభలో అర్జీలు ఇస్తున్న రైతులు

బ్రాహ్మణపల్లి రెవెన్యూ గ్రామ సభలో అర్జీలు ఇస్తున్న రైతులు

బ్రాహ్మణపల్లి రెవెన్యూ గ్రామ సభలో అర్జీలు ఇస్తున్న రైతులు

న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గం లోని బ్రాహ్మణపల్లి రెవిన్యూ గ్రామంలో రీసర్వే సందర్భంగా తమ భూములు పెద్ద ఎత్తున తగ్గించి ఇతరులకి ఎక్కించడం, దీనిలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకోవడం, దీనిపై రైతులు ఆందోళన చేయటం గతంలో జరిగింది. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గతంలో జరిగిన లోపాలను సరిచేయాలని గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ గ్రామ సభలో ఇచ్చే అర్జీలకి పరిష్కారం చూపాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సంవత్సరాల తరబడి తమ భూములు తగ్గించారు. సరిచేసి ఆన్లైన్ చేయండి అని రైతులు మొరపెట్టుకుంటున్న నేటి వరకు చెలించని అధికారులు, ఇకనైనా తమకు న్యాయం చేయాలని రైతులు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అర్జీలు ఇచ్చినవారు వై. వెంకటేశ్వరరావు, సురభి లక్ష్మి, నిసంకి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.(Story:బ్రాహ్మణపల్లి రెవెన్యూ గ్రామ సభలో అర్జీలు ఇస్తున్న రైతులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!