గిరిజన దర్బార్ లో వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
ఐటిడిఏ. పిఓ. చిత్ర మిశ్ర
న్యూస్ తెలుగు /ఏటూరునాగారం (ములుగు ) : గిరిజన దర్బార్ లో సమర్పించిన దరఖాస్తులకు సత్వరమే పరిష్కరించాలని, ఏటూరునాగారం ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్ లో గిరిజనుల నుండి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించి సమస్యలను త్వరితగతిన పరిష్కారం చూపాలని సంబంధిత సెక్టార్ అధికారులకు పిఓ సూచించారు. గిరిజన దర్బార్ లో వివిధ సమస్యల పై, వివిధ మండలాల నుండి గిరిజనుల నుంచి వచ్చిన (12) దరఖాస్తులను స్వయంగా స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎం రాజు కుమార్,ఏఓ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : గిరిజన దర్బార్ లో వచ్చిన దరఖాస్తులు వెంటనే)
